Homeటాప్ స్టోరీస్మ‌హేష్ టీమ్ వీసాల కోసం నిరీక్ష‌ణ‌!

మ‌హేష్ టీమ్ వీసాల కోసం నిరీక్ష‌ణ‌!

మ‌హేష్ టీమ్ వీసాల కోసం నిరీక్ష‌ణ‌!
మ‌హేష్ టీమ్ వీసాల కోసం నిరీక్ష‌ణ‌!

ఈ ఏడాది `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో సాలీడ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని త‌న ఖాతాలో వేసుకున్నారు మ‌హేష్‌బాబు. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ ఆనందంలో వున్న మ‌హేష్ రెట్టించిన ఉత్సాహంతో `స‌ర్కారు వారి పాట‌`కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 ప్ల‌స్ ‌రీల్స్ తో క‌లిసి మ‌హేష్ కూడా ఈ చిత్రానికి వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

లాక్‌డౌన్ లేక‌పోతే ఇప్ప‌టికే స్టార్ట్ కావాల్సింది. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. తొలి షెడ్యూల్‌ని యుఎస్‌లో ప్లాన్ చేశారు. రెండు నెల‌ల పాటు అక్క‌డే కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ముందు యుఎస్‌కు వెళ్లాల‌నుకున్నా ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో అంత సేఫ్ కాద‌ని భావించిన టీమ్ దాన్ని ముంబై లేదా మ‌రో చోట చేయాల‌నుకుంద‌ట‌. ప‌రిస్థితులు మ‌ళ్లీ మార‌డం..విదేశాల్లో షూటింగ్‌లు ఊపందుకోవ‌డంతో మ‌ళ్లీ `స‌ర్కారు వారి పాట‌` టీమ్ యుఎస్ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది.

- Advertisement -

ఇప్ప‌టికే వీసాల కోసం అప్లై చేశార‌ట‌. ప్ర‌స్తుతం అవి ప్రాసెస్‌లో వున్నాయి. జ‌న‌వ‌రి నుంచి యుఎస్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభింయి రెండు నెల‌ల పాటు షూటింగ్ జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే యుఎస్‌లో ఎక్క‌డెక్క‌డ షూట్ చేయాలో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. వీసాల‌దే లేట్.. వీసాలు వ‌చ్చేస్తే జ‌న‌వ‌రి నుంచి మ‌హేష్ సంద‌డి అమెరికాలో మొద‌ల‌వునుంద‌న్న మాట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All