స్టార్ హీరో మహేష్బాబు కోపంగా వున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణంగా ఏంటి?. సూపర్స్టార్ ఆగ్రహం వెనకున్న అసలు రహస్యం ఏంటి? అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయం తెలిసింది. `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరశురామ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేయడానికి మహేష్బాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ చిత్ర అఫీషియల్ లాంచ్ అండ్ టైటిల్ లోగో రిలీజ్ కార్యక్రమాన్ని ఈ నెల 31న సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజున అనౌన్స్ చేసి ఫ్యాన్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని మహేష్ భావించారట. అయితే టీమ్ అఫీషియల్గా ప్రకటించడానికి నాలుగు రోజుల ముందే ఈ మూవీ టైటిల్ లీక్ కావడం, మీడియాలో ప్రముఖంగా ప్రచురించడంతో హీరో మహేష్ టైటిల్ ఎలా లీక్ అయ్యిందని తన మీడియా టీమ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ చిత్రానికి `సర్కారు వారి పాట` అనే టైటిల్ని చిత్ర బృందం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భార స్కామ్ల నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోందని, ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనుందని తెలిసింది. ఇప్పటికే వరుసగా మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ని సొంతం చేసుకున్న మహేష్ ఈ సినిమాతో మరో హ్యాట్రిక్కి శ్రీకారం చుడుతున్నట్టు చెబుతున్నారు.