Homeటాప్ స్టోరీస్మ‌ళ్లీ మ‌హేష్ టీమ్‌ అక్క‌డికే వెళుతోందా?

మ‌ళ్లీ మ‌హేష్ టీమ్‌ అక్క‌డికే వెళుతోందా?

మ‌ళ్లీ మ‌హేష్ టీమ్‌ అక్క‌డికే వెళుతోందా?
మ‌ళ్లీ మ‌హేష్ టీమ్‌ అక్క‌డికే వెళుతోందా?

గ‌త ఏడాది `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

బ్యాకింగ్ వ్య‌వ‌స్థ‌పై సెటైరిక‌ల్ గా ఈ మూవీని చేస్తున్నారు. ఓ వైట్ కాల‌ర్ నేర‌గాడి నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల దుబాయ్‌లో మొద‌లైన విష‌యం తెలిసిందే. అక్క‌డి సుంద‌ర‌మైన లొకేష‌న్‌ల‌లో కీల‌క స‌న్నివేశాల‌తో పాటు కొన్ని పోరాట ఘ‌ట్టాల్ని తెర‌కెక్కించారు. ఈ సంద‌ర్భంగా మునుపెన్న‌డూ లేని విధంగా మ‌హేష్ దుబాయ్ లొకేష‌న్‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకున్నారు.

- Advertisement -

ఇటీవ‌లే చిత్ర బృందం దుబాయ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వ‌చ్చింది. మ‌రో షెడ్యూల్ కోసం మ‌హేష్ టీమ్ మ‌రోసారి దుబాయ్ వెళుతున్న‌ట్టు తెలిసింది. ఆ త‌రువాత గోవాలోనూ ఓ భారీ షెడ్యూల్ చేయ‌నున్నార‌ట‌. ఈ చిత్రానికి సంగీతం త‌మ‌న్‌, ఛాయాగ్ర‌హ‌ణం మ‌ది, క‌ళ ఏ ఎస్ ప్ర‌కాష్‌, ఎడిటింగ్ మార్తిండ్ కె. వెంక‌టేష్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All