Homeగాసిప్స్వంశీ కోసం మ‌హేష్ నిర్మాత అవుతున్నారా?

వంశీ కోసం మ‌హేష్ నిర్మాత అవుతున్నారా?

వంశీ కోసం మ‌హేష్ నిర్మాత అవుతున్నారా?
వంశీ కోసం మ‌హేష్ నిర్మాత అవుతున్నారా?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ త‌రువాత విశ్రాంతి కోసం అమెరికా వెళ్లిన మ‌హేష్ తిరిగి ఇండియా వ‌చ్చాక వంశీ పైడిప‌ల్లితో సినిమా చేస్తాన‌ని వెల్ల‌డించారు. కానీ సీన్ మారింది. వంశీ పైడిప‌ల్లి చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ స్థానంలో ప‌ర‌శురామ్‌తో సినిమాకు క‌మిట్ అయ్యారు.

దీంతో వంశీ పైడిప‌ల్లి మ‌రో హీరో కోసం వేట మొద‌లుపెట్టాల్సి వ‌చ్చిందని, అంద‌రినీ సంప్ర‌దించిన ఆయ‌‌న చివ‌రికి మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ఓకే చెప్పించుకున్నార‌ట‌. ఈ ఐడియా కూడా ఇచ్చింది మ‌హేషే అని, రామ్‌చ‌ర‌ణ్ ఈ క‌థ చేస్తానంటే ఆ సినిమాని తానే నిర్మిస్తాన‌ని మ‌హేష్ చెప్పిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో ఎంత నిజం వుందో తెలియ‌దు కానీ వంశీ పైడిప‌ల్లి మాత్రం రామ్‌చ‌ర‌ణ్‌తో త‌న నెక్ట్స్ చిత్రాన్ని చేయ‌బోతున్నార‌న్న‌ది మాత్రం నిజం.

- Advertisement -

గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `ఎవ‌డు` వంటి హిట్ చిత్రం తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `ఎవ‌డు`, మ‌హేష్ న‌టించిన `వ‌న్ నేనొక్క‌డినే` ఒకేసారి విడుద‌ల‌య్యాయి. ఈ రెండింటిలో `ఎవ‌డు` సూప‌ర్‌హిట్‌గా నిలిస్తే `వ‌న్ నేనొక్క‌డినే` నిరాశ‌ప‌రిచింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All