Homeటాప్ స్టోరీస్మహేష్ ను కలిసిన కేజీఎఫ్ దర్శకుడు

మహేష్ ను కలిసిన కేజీఎఫ్ దర్శకుడు

మహేష్ ను కలిసిన కేజీఎఫ్ దర్శకుడు
మహేష్ ను కలిసిన కేజీఎఫ్ దర్శకుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం తర్వాత మహేష్ మరే ఇతర చిత్రాలు కమిట్ అవ్వలేదు. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి కానీ దానిపై అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల కానున్న సంగతి తెల్సిందే. నవంబర్ రెండో వారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. దీంతో మహేష్ తన తర్వాతి సినిమాపై దృష్టి కేంద్రీకరించాడు. అయితే ఇప్పుడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మహేష్ ను కొద్దిసేపటి క్రితం కలవడం ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇద్దరూ కలిసి పనిచేసే విషయమై కొన్ని అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే, మరో భారీ ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా రూపుదిద్దుకుంటుంది. అయితే ఇది మహేష్ 27వ చిత్రమో లేక 28వ చిత్రమో తెలియాల్సి ఉంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All