మహేష్కి `మహర్ష` చిత్రంతో సూపర్హిట్ని అందించాడు వంశీ పైడిపల్లి. దీంతో అతని డైరెక్షన్లో మరో సినిమా చేయాలని మహేష్ ఫిక్సయ్యాడు. ఈలోపు `సరిలేరు నీకెవ్వరు` సినిమా రిలీజ్ అయి సంక్రాంతి చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే భారీ వసూళ్లని కురిపించిన చిత్రంగా నిలిచింది. దీని తరువాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకున్నారు మహేష్ కానీ కథ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టారు.
అదే సమయంలో మైత్రీ మూవీమేకర్స్ వారు పరశురామ్ని లైన్లోకి తీసుకొచ్చారు. తను చెప్పిన కథ మహేష్ని అమితంగా ఆకట్టుకుంది. లైన్ బాగుంది. ఫుల్ స్క్రిప్ట్ని సిద్ధం చేసి రమ్మన్నాడట. పరశురామ్ పుల్ బౌండ్ స్క్రిప్ట్ని సిద్ధం చేసేపనిలో వుండగా, `భీష్మ` దర్శకుడు వెంకీ కుడుముల కొత్త లైన్ వినిపించాడట. అదీ నచ్చడంతో అతన్ని కూడా ఫుల్బౌండ్ స్క్రిప్ట్తో రమ్మని చెప్పారట. ఈ ఇద్దరు దర్శకుల్లో మహేష్ ఎవరితో సినిమా చేస్తారా? అనే ఉత్కంఠ అభిమానల్లో మొదలైంది.
అయితే తాజా సమాచారం మేరకు మహేష్ యంగ్ డైరెక్టర్ పరశురామ్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్టు తెలిసింది. మైత్రీ మూవీమేకర్స్తో పాటు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, జిఎంబీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయట. మే లేదా జూన్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలిసింది.