Homeటాప్ స్టోరీస్మ‌హేష్ నెక్ట్స్ ఫిల్మ్‌కి ద‌ర్శ‌కుడు అత‌నే!

మ‌హేష్ నెక్ట్స్ ఫిల్మ్‌కి ద‌ర్శ‌కుడు అత‌నే!

 

Mahesh next film with Parasuram confirmed
Mahesh next film with Parasuram confirmed

మ‌హేష్‌కి `మ‌హ‌ర్ష‌` చిత్రంతో సూప‌ర్‌హిట్‌ని అందించాడు వంశీ పైడిప‌ల్లి. దీంతో అత‌ని డైరెక్ష‌న్‌లో మరో సినిమా చేయాల‌ని మ‌హేష్ ఫిక్స‌య్యాడు. ఈలోపు `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా రిలీజ్ అయి సంక్రాంతి చిత్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో దిల్ రాజుతో క‌లిసి అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని కురిపించిన చిత్రంగా నిలిచింది. దీని త‌రువాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌నుకున్నారు మ‌హేష్ కానీ క‌థ అనుకున్న స్థాయిలో లేక‌పోవ‌డంతో దాన్ని ప‌క్క‌న పెట్టారు.

- Advertisement -

అదే స‌మ‌యంలో మైత్రీ మూవీమేక‌ర్స్ వారు ప‌ర‌శురామ్‌ని లైన్‌లోకి తీసుకొచ్చారు. త‌ను చెప్పిన క‌థ మ‌హేష్‌ని అమితంగా ఆక‌ట్టుకుంది. లైన్ బాగుంది. ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసి ర‌మ్మ‌న్నాడ‌ట‌. ప‌ర‌శురామ్ పుల్ బౌండ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసేప‌నిలో వుండ‌గా, `భీష్మ‌` ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల కొత్త లైన్ వినిపించాడ‌ట‌. అదీ న‌చ్చ‌డంతో అత‌న్ని కూడా ఫుల్‌బౌండ్ స్క్రిప్ట్‌తో ర‌మ్మ‌ని చెప్పార‌ట‌. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల్లో మ‌హేష్ ఎవ‌రితో సినిమా చేస్తారా? అనే ఉత్కంఠ అభిమాన‌ల్లో మొద‌లైంది.

అయితే తాజా స‌మాచారం మేర‌కు మ‌హేష్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్టు తెలిసింది. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో పాటు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్ల‌స్‌, జిఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ట‌. మే లేదా జూన్ నుంచి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All