Homeగాసిప్స్లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ పూజా సెర్మ‌నీ!

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ పూజా సెర్మ‌నీ!

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ పూజా సెర్మ‌నీ!
లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ పూజా సెర్మ‌నీ!

`స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత స్టార్ హీరో మ‌హేష్‌బాబు మ‌రో క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీని ఈ నెల 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నెల 31తో లాక్‌డౌన్ ముగుస్తుండ‌టంతో చిత్ర బృందం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే పూజా సెర్మ‌నీని జర‌ప‌బోతున్నార‌ని తెలిసింది. ఎలంటి గెస్ట్‌లు లేకుండా ఫార్మ‌ల్ పూజ‌ని ఆ రోజు జ‌ర‌ప‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర బృందం మాత్ర‌మే వుండ‌బోతున్నార‌ట‌. స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రాన్ని ప‌ర‌శురామ్ తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఈ చిత్రం కోసం మ‌హేష్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని టీమ్ అనుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌ను కూడా ఈ చిత్రంలో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్న‌ట్టు తెలిసింది. అయితే డేట్స్ స‌ర్దుబాటుని బ‌ట్టి ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇవ్వాల‌నుకుంటోంద‌ట‌. వ‌న్స్ క్లారిటీ వ‌చ్చాక స్వ‌యంగా టీమ్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All