మే 31.. ఈ లేదీకి మహేష్ జీవితంలో ప్రత్యేక స్థానం వుంది. ఈ రోజు సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ప్రతీ ఏడాది ఈ రోజున తన చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ ఫ్యాన్స్ కి అదరిపోయే గిఫ్ట్లు ఇవ్వడం మహేష్బాబుకు అలవాటుగా మారింది. ఈ నెల 31న కూడా తన తండ్రి పుట్టిన రోజు కానుకగా తన ఫ్యాన్స్కి అదిరిపోయే గిఫ్ట్ని అందించబోతున్నాడు.
ప్రతీ ఏడాది ఈ రోజున కొత్త సినిమాల ఫస్ట్లుక్, లేదా టీజర్లని రిలీజ్ చేస్తున్న మహేష్బాబు ఈ ఏడాది తను పరశురామ్తో చేయబోతున్న సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ని చేయబోతున్నారు. పరశురామ్తో సినిమాని అఫీషియల్గా ప్రకటించనున్న మహేష్ ఇదే రోజు ఈ చిత్ర టైటిల్ని కూడా ప్రకటించి ఫ్యాన్స్ని ఖుషీ చేయబోతున్నారట.
`సరిలేరు నీకెవ్వరు` తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్బాబు సినిమా చేయాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆ స్థానంలో పరశురామ్తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ బడ్జెట్ ప్లానింగ్తో కొత్త పంథాలో ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.