Homeటాప్ స్టోరీస్`స‌ర్కారు వారి పాట‌`లో అదిరిపోయే ట్విస్ట్‌!

`స‌ర్కారు వారి పాట‌`లో అదిరిపోయే ట్విస్ట్‌!

`స‌ర్కారు వారి పాట‌`లో అదిరిపోయే ట్విస్ట్‌!
`స‌ర్కారు వారి పాట‌`లో అదిరిపోయే ట్విస్ట్‌!

`స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్‌,  14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. మ‌హేష్ న‌టిస్తున్న 27వ చిత్ర‌మిది.

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇందులో విల‌న్ పాత్ర‌కు అత్యంత ప్రాధాన్యం వుంద‌ని అందు కోసం ప‌లువురు కీల‌క స్టార్స్‌ని చిత్ర బృందం ప‌రిశీలిస్తోంద‌ని గత కొన్ని రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇందులో మ‌హేష్ బాబు ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని తాజా న్యూస్‌.

- Advertisement -

అందులో ఒక పాత్ర స్టాక్ మార్కెట్ బ్రోక‌ర్‌గా క‌నిపిస్తుంద‌ని, మ‌రో పాత్ర బ్యాంక్ మేనేజ‌ర్‌గా వుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ వాషింగ్ట‌న్ డీసీలో జ‌ర‌గ‌బోతోంది. ఇందు కోసం భారీ షెడ్యూల్‌నే ప్లాన్ చేశారు. ముందు క‌రోనా కార‌ణంగా ఈ షెడ్యూల్‌ని ఇండియాలోనే షూట్ చేయాల‌ని ప్లాన్ చేసినా స్టోరీ డిమాండ్ మేర‌కు తిరిగి అక్క‌డే షూట్ చేయాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All