మహేష్ నెక్స్ట్ సినిమాకి రంగం సిద్ధమైంది. `సరిలేరు నీకెవ్వరు` మూవీ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేయడం, స్టోరీ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి పరశురామ్తో సినిమా చేయడానికి మహేష్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఇటీవలే ఫైనల్ లైన్ని ఓకే చేయడంతో పరశురామ్ స్క్రిప్ట్కు తుదిమెరుగులు దిద్దే పనుల్లో వున్నారు. అంతా ఫైనల్ అయిపోతే ఈ చిత్రాన్ని ఈ నెల 25న అంటే సరిగ్గా ఉగాది రోజుల మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు లాంఛనంగా ముహూర్తం జరిపి ఆ తరువాత నుంచి రెగ్యులర్ షూట్కు వెళ్లాలన్నది మహేష్ ప్లాన్. టైమ్ చాలా తక్కువగా వుండటంతో పరశురామ్ ఈ కథపై సీరియస్గా వర్క్ చేస్తున్నారట.
స్క్రిప్ట్ ఫైనల్ అయిపోతే జూన్ నుంచి రెగ్యులర్షూట్కి వెళ్లబోతున్నట్టు తెలిసింది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వుండనుందని టీమ్ టాక్. ఈ సినిమాతో పాటు కొరటాల శివ, చిరు చిత్రాన్ని కూడా మహేష్ చేయనున్న విషయం తెలిసిందే.