మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కొరటా శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం కోకాపేట్లో ప్రత్యేకంగా వేసిన కాలనీ సెట్లో జరుగుతోంది. ఇక్కడే దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. ఇందులోనే కీలక సన్నివేశాల్ని పూర్తి చేస్తారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ చిత్రంలోని ఓ కీలక అతిథి పాత్రలో హీరో మహేష్ బాబు నటించబోతున్నారని గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు మహేష్ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారని, సినిమాలో ఆయన పాత్ర హైలైట్గా నిలుస్తుందని, రాడికల్ స్టూడెంట్గా ఆయన పాత్ర వుంటుందని తెలిసింది. సినిమాలో మహేష్, చిరు కాంబినేషన్లో కీలక సన్నివేశాలుంటాయని, దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరి మధ్య కీలక ఘట్టాలు వుంటాయని ఇవి సినిమాకు హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది.
అయితే ఈ అతిథి పాత్ర కోసం 30రోజులు మహేష్ కేటాయించినట్టు ప్రచారం జరుగుతున్న ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. ఇది మూవీ బడ్జెట్పై ప్రభావాన్ని చూపుతుందని, ఆ స్థాయిలో మహేష్కు పారితోషికం ఇవ్వాలని రామ్చరణ్ కూడా భావిస్తున్నారట.
దీనిపై త్వరలోనే రామ్చరణ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం వుందని తెలిసింది.