Homeగాసిప్స్లాక్‌డౌన్ త‌రువాత ఫ‌స్ట్ ముహూర్తం ఇదేనా?

లాక్‌డౌన్ త‌రువాత ఫ‌స్ట్ ముహూర్తం ఇదేనా?

లాక్‌డౌన్ త‌రువాత ఫ‌స్ట్ ముహూర్తం ఇదేనా?
లాక్‌డౌన్ త‌రువాత ఫ‌స్ట్ ముహూర్తం ఇదేనా?

మ‌హేష్ ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో శుభారంభాన్ని అందుకున్నారు. ఆయ‌న న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజుతో క‌లిసి అనిల్ సుంక‌ర నిర్మించారు. ఈ మూవీ త‌రువాత మ‌హేష్ త‌దుప‌రి చిత్రంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

వంశీ పైడిప‌ల్లి చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ స్థానంలో ప‌ర‌శురామ్ క‌థ‌ని ఓకే చేశారు మహేష్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఫైన‌ల్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసిన ప‌ర‌శురామ్ ఫైన‌ల్‌గా స్క్రిప్ట్‌ని లాక్ చేసిన‌ట్టు తెలిసింది. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మించ‌నున్న ఈ చిత్రాన్ని మే 31న లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌బోతున్నార‌ట. లాక్ డౌన్ మే 7కి ముగియ‌బోతోంది. 8 నుంచి లాక్‌డౌన్ ఎత్తేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

- Advertisement -

మే 31న మ‌హేష్ తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావ‌డంతో ఫార్మ‌ల్ పూజ‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌. మేక‌ర్స్ కూడా   మ‌హేష్ ఆలోచ‌న‌తో ఏకీభ‌విస్తుండ‌టంతో మ‌హేష్ – ప‌ర‌శురామ్‌ల చిత్రానికి ముహూర్తం ఫైన‌ల్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో మ‌హేష్‌కు జోడీగా కియారా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆమె డేట్స్ స‌మ‌స్య కార‌ణంగా సారా అలీఖాన్‌ని ప‌రిచ‌యం చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు టాక్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All