`Rx 100` వంటి సంచలన చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతికి మంచి పేరొచ్చింది కానీ ఆ తరువాత ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కడం లేదు. `మహా సముద్రం` పేరుతో అజయ్ భూపతి ఓ బైలింగ్వల్ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శర్వానంద్ ఓకే చెప్పేశాడు. కానీ మరో హీరో, హీరోయిన్స్ ఓకే కాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమనే మాటలు వినిపించాయి. ఏకంగా ఈ చిత్రాన్ని పక్కన పెట్టారని వార్తలు మొదలయ్యాయ.
తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సోమవారం అఫీషియల్గా ప్రకటించింది. గమ్యం, ప్రస్థానం వంటి చిత్రాల తరువాత మరో సారి ఆ స్థాయికి మించి ఇంటెన్స్ స్టోరీలో నటిస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. అజయ్ భూపతి ఈ చిత్రం కోసం పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారని, మహేష్ బాబుతో `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ని అందించిన తరువాత మా సంస్థ నుంచి వస్తున్న పవర్ఫుల్ చిత్రం `మహా సముద్రం`అని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ సర్ప్రైజ్లు ప్రతీ వారం వుంటాయని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే శర్వాతో కలిసి నటించే మరో హీరో ఎవరన్నది ప్రకటించకపోవడం గమనార్హం.
Announcement ?
We are Happy to announce our next project with our Versatile actor @ImSharwanand. It’s a Telugu-Tamil bilingual project titled #MahaSamudram, directed by Ajay Bhupathi under AK Entertainments. @DirAjayBhupathi @AKentsOfficial@AnilSunkara1 pic.twitter.com/cUGtC2GhDp
— AK Entertainments (@AKentsOfficial) September 7, 2020