Homeటాప్ స్టోరీస్సైబ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించిన‌ అజ‌య్ భూప‌తి!

సైబ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించిన‌ అజ‌య్ భూప‌తి!

సైబ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించిన‌ అజ‌య్ భూప‌తి!
సైబ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించిన‌ అజ‌య్ భూప‌తి!

`Rx100` సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించారు అజ‌య్ భూప‌తి. య‌దార్ధ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ద‌ర్శ‌కుడిగా ఆజ‌య్ భూప‌తికి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ప్ర‌స్తుతం త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌టి క్రేజీ చిత్రాన్ని తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తి త‌న త‌దుపరి చిత్రంగా `మ‌హాస‌ముద్రం`ని రూపొందించ‌బోతున్నారు.

భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ఓ హీరోగా శ‌ర్వానంద్ న‌టించ‌నుండ‌గా మ‌రో హీరోగా సిద్ధార్ధ న‌టించ‌నున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి శుక్రవారం సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్సి సంప్ర‌దించారు. వివ‌రాల్లోకి వెళితే..అజ‌య్ భూప‌తి పేరు మీద ఓ వ్య‌క్తి మోసాల‌కు పాల్పడుతున్నాడ‌ని తెలిసింది. ఈ విష‌యంపై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఆశ్ర‌యించారు.

- Advertisement -

అవ‌కాశాల పేరుతో స‌ద‌రు వ్య‌క్తి అమ్మాయిల‌ని ట్రాప్ చేస్తున్నాడ‌ని తెలుసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా త‌న పేరుపై వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల‌ని న‌మ్మొద్ద‌ని అజ‌య్ భూతి ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All