`Rx100` సినిమాతో సంచలనం సృష్టించారు అజయ్ భూపతి. తొలి చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో నెక్ట్స్ ఫిల్మ్ వెంటనే మొదలవుతుందని అంతా భావించారు. కానీ ఇంత వరకు అజయ్ భూపతి కొత్త సినిమా ప్రారంభం కాలేదు. `Rx100` తరువాత అజయ్ భూపతి భారీ మల్టీ స్టార్ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి `మహాసముద్రం` అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు.
ముందు రవితేజని అనుకున్నారు. ఎక్కడో ఏదో జరిగింది. ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నారు. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ శర్వానంద్ దగ్గరికి వెళ్లింది. అంతా ఓకే.. మెయిన్ హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మరో హీరో కోసం అన్వేషణ మొదలైంది. ఫైనల్గా సిద్దార్ధ్ కి కథ వినిపించారు. చాలా కాలం తరువాత తెలుగులో సినిమా కావడంతో కాన్సెప్ట్ నచ్చి సిద్ధార్ధ్ ఈ చిత్రానికి ఓకే చెప్పేశాడు.
త్వరలోనే సినిమా స్టార్ట్ చేయాలని అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు ఇంతలో కరోనా ఎటాక్ చేయడంతో ప్లాన్ మొత్తం మారిపోయింది. అజయ్ భూపతికి సిద్ధార్ద్ రిప్లై ఇవ్వడం మానేశాడట. దీంతో ఈ సినిమా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని, హిట్ డైరెక్టర్కి మళ్లీ ఎదురుదెబ్బ తగిలిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.