శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న చిత్రం మహా సముద్రం. ఈ చిత్రాన్ని మొదటగా జులైలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం వచ్చింది. మొత్తానికి జులైలో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసారు. అలాగే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకోవడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసారు. దీంతో పాటు సిద్ధార్థ్, శర్వాలు గన్ పట్టుకుని ఇంటెన్స్ గా ఉన్న ఫోటోను షేర్ చేసారు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఇక అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.
ఆరెక్స్ 100తో గుర్తింపు తెచ్చుకున్న చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక సినిమాలో కేజిఎఫ్ ఫేమ్ గరుడ రామ్, జగపతి బాబు, రావు రమేష్ లు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
Our Intense & #ImmeasurableLove ❤️????Tale is ready to hit your Hearts ????#MahaSamudram ???? Journey
in Theatres Begins from
???????????? ???????????????? ????????An @DirAjayBhupathi FILM ????@Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial pic.twitter.com/lQJGYg1yF8
— Sharwanand (@ImSharwanand) August 27, 2021