తెలంగాణ ఉద్యమ సారధి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరపైకి రానుందంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత మధుర శ్రీధర్రెడ్డి తానే కేసీఆర్ బయోపిక్ని తెరపైకి తీసుకురాబోతున్నానంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి నెలలు కావస్తోంది. దీంతో శ్రీధర్రెడ్డి ప్రకటన వరకే పరిమితం అయిపోయారని, సినిమా తీయడం కష్టమేనని అంతా భావించారు.
తాజాగా కేసీఆర్ బయోపిక్ గురించి నిర్మాత శ్రీధర్రెడ్డి మరోసారి స్పందించారు. సీఎం కేసీఆర్ బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ఈ చిత్రాన్ని తాను వదిలేయలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ స్థాయి నాయకుడు. ఆయనపై సినిమా అంటే భారీ స్థాయిలో వుండాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ని పట్టుకోగల నటుడిని వెతుకుతున్నాం. అలాంటి నటుడు కుదిరినప్పుడే సినిమా ప్రారంభించాలనుకుంటున్నాం` అన్నారు మధుర శ్రీధర్రెడ్డి.
బడ్జెట్ గురించి వెల్లడిస్తూ ` 20 కోట్ల బడ్జెట్తో సినిమాని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాం. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలన్నది మా ఆలోచన. అందు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కీలకం. దాన్ని సమకూర్చుకోవాలంటే సమయం పడుతుంది. అందుకే ఇంత కాలం పడుతోంది. అంతే కానీ నేను కేసీఆర్ బయోపిక్ని పక్కన పెట్టలేదని మధుర శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.