Homeటాప్ స్టోరీస్బ‌న్నీకి త‌మిళ హీరో కూడా నో చెప్పాడా?

బ‌న్నీకి త‌మిళ హీరో కూడా నో చెప్పాడా?

బ‌న్నీకి త‌మిళ హీరో కూడా నో చెప్పాడా?
బ‌న్నీకి త‌మిళ హీరో కూడా నో చెప్పాడా?

అల్లు అర్జున్ – సుకుమార్ లకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టిన విజ‌య్ సేతుప‌తి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ చిత్రం `పుష్ప‌` తెర‌పైకి రాబోతున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందే సైలెంట్‌గా బ‌న్నీ లేకుండానే టు షెడ్యూల్స్ పూర్తి చేసిన సుకుమార్‌కి విజ‌య్ సేతుప‌తి త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందు కోసం స‌రికొత్త మేకోవ‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసి బ‌న్నీ పిక్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ని పెంచేశాయి. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తిని అనుకున్నారు. అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వ‌కుండానే ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు.

- Advertisement -

ఆ పాత్ర‌లో నారా రోహిత్ నటిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌నా ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డంతో తాజాగా త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ ఆ పాత్ర‌లో న‌టిస్తారంటూ వార్త‌లు షికారు చేశాయి. దీనిపై మాధ‌వ‌న్ స్పందించారు. ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేర‌ళ‌లో నెల రోజుల పాటు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశారు న‌వంబ‌ర్ నుంచి అక్క‌డ యూక్ష‌న్ స‌న్నివేశాల‌తో షూటింగ్ ప్రారంభిస్తార‌ట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All