మలయాళంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన చిత్రం `లూసీఫర్`. మోహన్లాల్, పృథ్వీరాజ్ కీలక హీరోలుగా నటించారు. అక్కడ సూపర్ హిట్గా నిలవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి ముచ్చటపడి రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఏ దర్శకుడితో రీమేక్ చేయించాలని గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రానికి రామ్చరణ్ లేదా చిరంజీవి సతీమణి నిర్మాత సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్ర రీమేక్ కోసం ముగ్గురు దర్శకులను ఫైనల్ చేశారు. వి.వి.వినాయక్, `సాహో` ఫేమ్ సుజీత్, బాబీ. అయితే ఈ ముగ్గురు దర్శకుల్లో సుజీత్ అయితే బాగుంటుందని రామ్చరణ్, చిరు భావించారట.
వెంటనే రీమేక్ బాధ్యతల్ని అతనికి అప్పగించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్ర రీమేక్ కోసం స్క్రిప్ట్ని సిద్ధం చేసే పనిలో సుజీత్ బిజీగా వున్నాడట. అయితే ఇప్పటికే తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇదే చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. కానీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. అంతా దారుణంగా పబ్లిసిటీ చేశారు. కాబట్టి రీమేక్ వర్కవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నాయని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.