Homeన్యూస్మళ్ళీ రిపీట్ కానున్న లవ్ స్టోరీ కాంబో

మళ్ళీ రిపీట్ కానున్న లవ్ స్టోరీ కాంబో

మళ్ళీ రిపీట్ కానున్న లవ్ స్టోరీ కాంబో
మళ్ళీ రిపీట్ కానున్న లవ్ స్టోరీ కాంబో

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకోగలిగింది. అలాగే మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా లవ్ స్టోరీ నిలిచింది. ఇండియా వైడ్ గా లవ్ స్టోరీ 9 కోట్ల షేర్ ను సాధించడం విశేషం.

అలాగే ఓవర్సీస్ లో కూడా లవ్ స్టోరీకు వస్తోన్న రెస్పాన్స్ అద్భుతం. ఈ చిత్రం మొదటి రోజు పూర్తి కాకుండానే హాఫ్ మిలియన్ డాలర్స్ ను సాధించింది. ఈ చిత్ర విజయం పట్ల టీమ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా కాలం వెయిట్ చేసి థియేటర్స్ లో విడుదల చేసినందుకు ఈ రెస్పాన్స్ రావడం పట్ల అంతా సంతోషంగా ఉన్నారు.

- Advertisement -

లవ్ స్టోరీ నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందని తెలియజేసాడు. “ఈ టీమ్ చాలా మంచి బాండింగ్ కుదిరింది. అందుకే మళ్ళీ రిపీట్ చేయనున్నాం” అని తెలిపాడు. శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయబోయే చిత్రం తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ టీమ్ తో పనిచేస్తాడని సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All