Homeటాప్ స్టోరీస్`ఆదిపురుష్‌`లో ఫైన‌ల్‌గా హీరోయిన్‌ని ఫిక్స్ చేశారా?

`ఆదిపురుష్‌`లో ఫైన‌ల్‌గా హీరోయిన్‌ని ఫిక్స్ చేశారా?

Kriti sanon finalised as seeta in adipurush? 
Kriti sanon finalised as seeta in adipurush?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం ఇట‌లీలో జ‌రుగుతోంది. లాక్‌డౌన్ ముందు క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో మ‌ధ్య‌లోనే షూటింగ్ ఆపేసి చిత్ర బృందం ఇండియా తిరిగి వ‌చ్చేసింది. దాదాపు ఏడు నెల‌ల విరామం త‌రువాత మ‌ళ్లీ షూటింగ్‌కి అనుమ‌తులు ఇవ్వ‌డంతో `రాధేశ్యామ్‌` టీమ్ ఇట‌లీ వెళ్లింది.

అక్క‌డ ప్ర‌స్తుతం కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ప్ర‌భాస్ మ‌రో రెండు భారీ చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి నాగ్ అశ్విన్ మూవీ కాగా మ‌రొక‌టి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ `ఆదిపురుష్‌`. ఈ మూవీ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. టిసిరీస్ బ్యాన‌ర్‌పై దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని 3డీలో నిర్మించ‌బోతున్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే ఈ మూవీ కోసం రావ‌ణుడి పాత్ర కోసం బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ని ఎంపిక చేసిన చిత్ర బృందం హీరోయిన్‌గా సీత పాత్ర కోసం ప‌లువురు క్రేజీ హీరోయిన్‌ల‌ని ప‌రిశీలించి తాజా కృతి స‌న‌న్‌ని ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాత్ర‌లో అనుష్క శెట్టి, కీర్తి సురేష్‌, ఊర్వ‌శీ రౌతేలా పేర్లు వినిపించాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All