Homeగాసిప్స్తెలుగులో మూడ‌వ సినిమాకు సై!

తెలుగులో మూడ‌వ సినిమాకు సై!

తెలుగులో మూడ‌వ సినిమాకు సై!
తెలుగులో మూడ‌వ సినిమాకు సై!

బాలీవుడ్ సెన్సేష‌న్ కియారా అద్వానీ. వ‌రుస క్రేజ‌.ఈ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నా నెట్‌ప్లిక్స్ కోసం హాట్ హాట్ వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తోంది. `ఎం.ఎస్‌.ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ`తో పాపుల‌ర్ అయిన కియారా నెట్‌ప్లిక్స్ కోసం చేసిన `ల‌స్ట్ స్టోరీస్‌`తో బాలీవుడ్‌లో హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోయింది. త‌న‌దైన న‌ట‌న‌తో హాట్ హాట్ స‌న్నివేశాల్ని కియారా ర‌క్తి క‌ట్టించిన తీరుకు ప్రేక్ష‌కుల‌తో పాటు మేక‌ర్స్ కూడా ఫిదా అయిపోయారు.

ప్ర‌స్తుతం ల‌క్ష్మీబాంబ్‌, ఇందూకీ జ‌వాని, షేర్ షా, భూల్ బులాయా 2 చిత్రాల్లో న‌టిస్తోంది. నాలుగు చిత్రాల్లో న‌టిస్తున్న కియారా డేట్స్ కుద‌ర‌డం లేద‌ట‌. తెలుగులో మ‌రో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తు్న ఫ‌లించ‌డం లేద‌ని చెబుతోంది. అయినా తాను ఈ ఏడాది క‌చ్చితంగా తెలుగు సినిమా చేస్తాన‌ని తాజాగా వెల్ల‌డించ‌డం విశేషం.

- Advertisement -

కియారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చిత్రం `భ‌ర‌త్ అనేన నేను` మ‌హేష్ హీరోగా న‌టించిన చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించి కియారాకు మ‌రో ఆఫ‌ర్‌ని తెచ్చిపెట్టింది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `విన‌య విధేయ రామ‌`. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అయినా కియారా డిమాండ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. మ‌హేష్ తాజా చిత్రం కోసం కియారాని చిత్ర బృందం గ‌త కొన్ని రోజులుగా సంప్ర‌దిస్తోంది. డేట్స్ స‌మ‌స్య కార‌ణంగా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేక‌పోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All