బాలీవుడ్ సెన్సేషన్ కియారా అద్వానీ. వరుస క్రేజ.ఈ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నా నెట్ప్లిక్స్ కోసం హాట్ హాట్ వెబ్ సిరీస్లలోనూ నటిస్తోంది. `ఎం.ఎస్.ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ`తో పాపులర్ అయిన కియారా నెట్ప్లిక్స్ కోసం చేసిన `లస్ట్ స్టోరీస్`తో బాలీవుడ్లో హాట్ ఫేవరేట్గా మారిపోయింది. తనదైన నటనతో హాట్ హాట్ సన్నివేశాల్ని కియారా రక్తి కట్టించిన తీరుకు ప్రేక్షకులతో పాటు మేకర్స్ కూడా ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం లక్ష్మీబాంబ్, ఇందూకీ జవాని, షేర్ షా, భూల్ బులాయా 2 చిత్రాల్లో నటిస్తోంది. నాలుగు చిత్రాల్లో నటిస్తున్న కియారా డేట్స్ కుదరడం లేదట. తెలుగులో మరో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తు్న ఫలించడం లేదని చెబుతోంది. అయినా తాను ఈ ఏడాది కచ్చితంగా తెలుగు సినిమా చేస్తానని తాజాగా వెల్లడించడం విశేషం.
కియారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చిత్రం `భరత్ అనేన నేను` మహేష్ హీరోగా నటించిన చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి కియారాకు మరో ఆఫర్ని తెచ్చిపెట్టింది. రామ్చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అయినా కియారా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. మహేష్ తాజా చిత్రం కోసం కియారాని చిత్ర బృందం గత కొన్ని రోజులుగా సంప్రదిస్తోంది. డేట్స్ సమస్య కారణంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతోంది.