Homeటాప్ స్టోరీస్చరణ్ సినిమాకు మతిపోయే పారితోషికం తీసుకుంటున్న కియారా

చరణ్ సినిమాకు మతిపోయే పారితోషికం తీసుకుంటున్న కియారా

చరణ్ సినిమాకు మతిపోయే పారితోషికం తీసుకుంటున్న కియారా
చరణ్ సినిమాకు మతిపోయే పారితోషికం తీసుకుంటున్న కియారా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే ఆచార్యలో స్పెషల్ కామియోలో నటిస్తున్నాడు చరణ్. ఈ రెండు తర్వాత శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే.

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా టాప్ నటి కియారా అద్వానీని తీసుకున్నట్లు అధికారికంగా తీసుకున్న విషయం తెల్సిందే.

- Advertisement -

అయితే ఈ చిత్రం కోసం కియారా తీసుకుంటున్న పారితోషికం ప్రధాన టాకింగ్ పాయింట్ గా మారింది. ఎందుకంటే ఈ భామ ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటోందిట. హిందీలో అత్యంత క్రేజ్ ఈ భామకు ఉండటంతో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కాదనలేక ఆ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All