మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎస్ ఎస్ థమన్ ను సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ చేసారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
అలాగే బాలీవుడ్ టాప్ భామ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ మొదలుకానున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 8 నుండి మొదలుకానుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ యూరోప్ చేరుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లాస్ట్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటాడు. మరోవైపు ఆచార్యలో తన పార్ట్ చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేసాడు చరణ్. సో, కమిట్మెంట్స్ అన్నీ పూర్తవ్వడంతో శంకర్ చిత్రానికి బల్క్ డేట్స్ ను ఇస్తున్నాడు. సెప్టెంబర్ 8 నుండి డేట్స్ ఇవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ కు సన్నాహాలు చేస్తున్నారు.