Homeటాప్ స్టోరీస్న‌టుడిగా న‌న్నుకొత్త‌గా ఆవిష్క‌రించింది -  మ‌హేష్

న‌టుడిగా న‌న్నుకొత్త‌గా ఆవిష్క‌రించింది –  మ‌హేష్

న‌టుడిగా న‌న్నుకొత్త‌గా ఆవిష్క‌రించింది -  మ‌హేష్
న‌టుడిగా న‌న్నుకొత్త‌గా ఆవిష్క‌రించింది –  మ‌హేష్

మ‌హేష్ న‌టించిన చిత్రం `ఖ‌లేజా`. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సింగ‌న‌మ‌ల ర‌మేష్‌, సి. క‌ల్యాణ్‌, స‌త్య‌రంగ‌య్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. `అత‌డు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్ర‌మిది. ఈ మూవీ విడుద‌లై నేటికి 10 ఏళ్లు అవుతోంది. 2010 అక్టోబ‌ర్ 7న ఈ చిత్రం విడుద‌లైంది. దైవం మానుష్య‌రూపేనా అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ మూవీ విడుద‌లై బుధ‌వారంతో ప‌దేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మ‌హేష్ మ‌రోసారి ఈ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని అభిమానుల‌తో పంచుకున్న మ‌హేష్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. `ఖలేజా`కు 10 ఏళ్లు! నటుడిగా నన్ను తిరిగి ఆవిష్కరించారు !! ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుంది !! నా  స్నేహితుడు, బ్రిలియంట్‌ త్రివిక్రమ్ కు  ధన్యవాదాలు మా తదుపరి సినిమా కోసం ఎదురుచూస్తున్నాను … అది అతి త్వరలోనే..` అని ట్వీట్ చేశారు మ‌హేష్‌.

- Advertisement -

ఈ సినిమాతో త్రివిక్ర‌మ్ – మ‌హేష్‌ల క‌ల‌యిక‌లో రెండు చిత్రాలొచ్చాయి. మూడ‌వ సినిమా ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మ‌హేష్ 25వ సినిమాని చేయాల‌ని త్రివిక్ర‌మ్ ట్రై చేశారు. కానీ ఎందుకో కుద‌ర‌లేదు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరుగుతూ వ‌చ్చింది. రాజ‌మౌళి మూవీ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌య‌కిలో సినిమా సెట్స్‌పైకి రానుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All