`కేజీఎఫ్ చాప్టర్ 1` సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు మామూలు స్టార్గా వున్న హీరో యష్ని పాన్ ఇండియా స్టార్ని చేసింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. `కేజీఎఫ్ చాప్టర్ 2` పేరుతో కిరంగదూర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల యష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసింది.
రెట్రో లుక్లో యష్ స్టిల్ సినిమాపై మరింత క్రేజ్ని పెంచేసింది. అధీరాగా బాలీవుడ్ బ్యాడ్మెన్ సంజయ్దత్ నటిస్తున్నారు. రవీనా టాండన్ రమీకాసేన్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో టీజర్ని రిలీజ్ చేస్తామని ఆ మధ్య టమ్ ప్రకటించింది. దీనిపై వస్తున్న వార్తలపై క్రియేటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ స్పందించారు. టీజర్ రిలీజ్ అంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు.
మా టీమ్ గానీ, మా హీరో, దర్శకుడు కానీ అలాంటి ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. లాక్డౌన్ వేళ దేశం క్లిష్ట పరిస్థితుల్లో సినిమాకు సంంధించిన ఏ కార్యక్రమాన్ని చేపట్టబోమని స్పష్టం చేశాడు. దీంతో రాఖీభాయ్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే సినిమా రిలీజ్కు ముందు మాత్రం టీజర్, ట్రైలర్లతో ఫ్యాన్స్ని ఖుషీ చేస్తామని చెప్పడంతో కొంత నిరుత్సాహం, కొంత ఆనందానికి లోనవుతున్నారు యష్ ఫ్యాన్స్.