కన్నడ చిత్రసీమలో తొలిసారి అత్యధిక బడ్జెట్తో రూపొందిన చిత్రం `కేజీఎఫ్`. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి హాలీవుడ్ స్థాయి యాక్షన్ చిత్రాల్ని మనమూ తీయగలమని సగర్వంగా చాటి చెప్పిన సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో కొత్త చర్చకు తెరలేపిన ఈ చిత్రం వసూళ్ల పరంగానూ సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి.
మైసూర్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్పై, తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హాలీవుడ్లో ఒకతను చెప్పినట్టు ప్రతీ దర్శకుడు తాను మంచి నటుడినని, ప్రతీ హీరో తానే మంచి డైరెక్టర్నని భావిస్తుంటారు. అలాగే ప్రతీ నటుడు కూడా తాను మంచి పొలిటీషియన్ని అని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడా నటించడమే అక్కడా నటించడమే కాబట్టి` అని యష్ చమత్కరించారు.
ఇక తన పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ రాజకీయాలు అనేవి సేవా పరమైన వృత్తి. దానికంటూ ప్రత్యేకమైన క్వాలిటీస్ వుండాలి. రాజకీయాలు తప్పని, నాయకులు తప్పని చెప్పను. కానీ తను రాజకీయాల్లోకి ఎంటర్ కావాలి అనే సమయం వస్తే మాత్రం తప్పకుండా రాజకీయాల్లోకి ప్రవేశిస్తా` అని స్పష్టం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య నుంచి సీనియర్ కన్నడ హీరో అంబరీష్ భార్య, నటి సుమలత పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆమె తరుపున మాండ్యాలో యష్ ప్రచారాన్ని నిర్వహించారు.