భారతీయ తెరపై హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని చిత్రం `కేజీఎఫ్2`. రాక్స్టార్ యష్ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్ కొన్ని గంటల వ్యవధిలోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ని దాటేసి యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై గట్స్ వున్న నిర్మాత విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ టీజర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటూ హాట్ టాపిక్గా మారింది.
టీజర్తో చాప్టర్ 2ని ఏ రేంజ్లో సెట్ చేశారో షాంపిల్గా చూపించారు మేకర్స్. దీంతో టీజరే ఇలా వుంటే సినిమా ఎలా వుంటుందో.. విజువల్స్ ఏ రేంజ్లో వుంటాయో.. ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అంటూ తాజాగా చర్చ మొదలైంది. టీజర్తో అంచనాలు స్కై హైకి చేరడంతో ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు వుంటుందా? అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో `కేజీఎఫ్2`ని జూలై 30న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో ఇలాంటి పాన్ ఇండియా స్థాయి మూవీ బడ్జెట్ని రికవరీ చేయడం కష్టం కాబట్టి జూలై వరకు ఆగాలని చిత్ర బృందం భావిస్తోందట. అలా చేస్తేనే పూర్తి స్థాయిలో బడ్జెట్ని తిరిగి రాబట్టొచ్చని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.