టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చార్మి, పూరితో పాటు ఈ చిత్రాన్ని కరణ్జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. లాక్డౌన్ బిఫోర్ ముంబైలో ప్రారంభమైన ఈ మూవీ కోసం పలు కీలక సన్నివేశాల్ని ముంబై వీధుల్లో చిత్రీకరించారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొనగా ముంబై వీధుల్లో బైక్ ఛేజింగ్ సన్నివేశాల్ని చిత్రీకరించారు.
కరోనా కారణంగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గత పది నెలలుగా ఆగిపోయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే పూరి జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా నటించబోతున్నారట. ఇప్పటికే యష్కి పూరి కథ వినిపించారట. యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
మాఫియా బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ రూపొందనుందట. విజయ్ దేవరకొండతో చేస్తున్న `ఫైటర్` మూవీ పూర్తి కాగానే యష్ మూవీని సెట్స్ పైకి తీసుకెళతారట. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే పూరి జగన్నాధ్ వెల్లడించనున్నట్టు తెలిసింది.