Homeటాప్ స్టోరీస్మ‌హేష్‌కు జోడీని కూడా ఫిక్స్ చేశారా?

మ‌హేష్‌కు జోడీని కూడా ఫిక్స్ చేశారా?

Keerthy suresh in Mahesh - Parasuram film
Keerthy suresh in Mahesh – Parasuram film

ఈ సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకున్నారు మ‌హేష్‌. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించిన ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ అందించిన విజ‌యాన్ని ఆస్వాదిస్తున్న మ‌హేష్ ఇటీవ‌ల అమెరికా వెళ్లి వ‌చ్చారు కూడా. వెకేష‌న్ పేరుతో కుటుంబంతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేసి వ‌చ్చిన మ‌హేష్ ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ మూవీకి రెడీ అయిపోతున్నారు.

వంశీ పైడిప‌ల్లిని ప‌క్క‌న పెట్టి `గీత గోవిందం` ఫేమ్ ప‌ర‌శురామ్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్‌ వ‌ర్క్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో పాటు 14 రీల్స్ ప్ల‌స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మే లేదా జూన్‌లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఇందులో మ‌హేష్‌కి జోడీని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. రొమాంటిక్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రం కోసం క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఆ క్రేజీ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు కీర్తి సురేష్ అని తాజా స‌మాచారం. కీర్తి సురేష్ ప్ర‌స్తుతం మిస్ ఇండియా, పెంగ్విన్‌, రంగ్ దే, మ‌ర‌క్కార్ చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ చిత్రాల‌న్నీ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. మ‌ల‌యాళ చిత్రం `మ‌ర‌క్కార్ : అర‌బిక్క‌డ‌లైంట్ సింగం` క‌రోనా వైర‌స్ కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All