షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ 13 రోజుల్లోనే 206 కోట్ల పైచిలుకు వసూళ్ల ని సాధించింది . దాంతో ఈ ఏడాది వసూళ్లలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది కబీర్ సింగ్ . తెలుగులో ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది .
జూన్ 21 న విడుదలైన కబీర్ సింగ్ చిత్రానికి ఎక్కువగా విమర్శలే వచ్చాయి అయితే విమర్శల కంటే ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి ఇప్పుడు . 200 కోట్ల వసూళ్లు దాటినప్పటికీ ఎక్కడా స్పీడ్ తగ్గలేదు దాంతో అవలీలగా 250 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొత్తానికి షాహిద్ కపూర్ పంట పండింది ఈ చిత్రంతో .
- Advertisement -