Homeటాప్ స్టోరీస్మహేష్ తదుపరి చిత్రం అర్జున్ రెడ్డి డైరెక్టర్ తోనేనా ?

మహేష్ తదుపరి చిత్రం అర్జున్ రెడ్డి డైరెక్టర్ తోనేనా ?

మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే . ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరుపుకుంది . అలాగే 2020 సంక్రాంతి కి విడుదల అని డేట్ కూడా ప్రకటించారు . అయితే ఆ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఏది అన్న చర్చ సాగుతోంది దాంతో అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ రెడ్డి వంగా లైన్ లోకి వచ్చాడు . మహేష్ బాబు కు కథ చెప్పానని ,అది బాగా నచ్చిందని కాకపోతే బౌండెడ్ స్క్రిప్ట్ అడిగాడని ప్రస్తుతం నేను అదేపనిలో ఉన్నానని అంటున్నాడు .

- Advertisement -

సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో ” కబీర్ సింగ్ ” గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా ఈనెల 21న విడుదల కానుంది . అంటే జూన్ కంప్లీట్ అయ్యాక జూలై నుండి మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ ని పూర్తిచేసే పనిలో పడనున్నాడు సందీప్ రెడ్డి వంగా . పూర్తి కథ మహేష్ బాబు కి నచ్చితే ఇక సందీప్ రెడ్డి తోనే తదుపరి సినిమా అన్నమాట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All