Homeటాప్ స్టోరీస్ద‌ర్శ‌కేంద్రుడి క‌ల ఇప్ప‌టికైనా నెర‌వేరేనా?

ద‌ర్శ‌కేంద్రుడి క‌ల ఇప్ప‌టికైనా నెర‌వేరేనా?

ద‌ర్శ‌కేంద్రుడి క‌ల ఇప్ప‌టికైనా నెర‌వేరేనా?
ద‌ర్శ‌కేంద్రుడి క‌ల ఇప్ప‌టికైనా నెర‌వేరేనా?

ద‌ర్శ‌కేంద్రుడు కె. రావేంద్ర‌రావు మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేయాల‌నుకున్నారా?.. 17 ఏళ్ల క్రితం ఆయ‌న క‌న్న క‌ల క‌ల‌గానే మిగిలిపోయిందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అప్ప‌ట్లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చాలా త‌క్కువ‌. అయితే ఆ స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌ల క‌ల‌యిక‌లో ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని రాఘ‌వేంద్ర‌రావు ప్లాన్ చేశారట‌.

విభిన్న‌మైన క‌థ, క‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని చేయాల‌నుకున్నార‌ట‌. దీనికి `త్రివేణి సంగ‌మం` అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసుకున్నార‌ట‌. అయితే ఆ స‌మ‌యంలో చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌లు ఇత‌ర ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వుండ‌టం, ఫ్యాన్స్ మ‌ల్టీస్టార‌ర్‌ని అంగీక‌రిస్తారో లేదో అనే భ‌యం వుండ‌టంతో ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేద‌ట‌. అయితే ఆ స్థానంలో త‌న వంద‌వ చిత్రంగా `గంగోత్రి` చిత్రాన్ని చేశారు. బ‌న్నీని హీరోగా ప‌రిచ‌యం చేశారు.

- Advertisement -

అయితే ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల దృక్ప‌థం మారింది. అభిరుచులూ మారాయి. టోట‌ల్‌గా సినిమా స్వ‌‌రూప‌మే మారింది. దీంతో రాఘ‌వేంద్రుడికి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `త్రివేణి సంగ‌మం`పై మ‌న‌సు మ‌ళ్లింద‌ట‌. ఎప్ప‌టికైనా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాలని భావిస్తున్నార‌ట‌. మ‌రి రాఘ‌వేంద్రరావు క‌ల ఇప్ప‌టికైనా ఫ‌లిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All