అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొంత కాలంగా వరుస కథనాలు వినిపిస్తున్నారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` సీక్వెల్తో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటూ ప్రచారం జరిగింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత రౌడీ హీరో, టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంతో జాన్వీ తెరంగేట్రం వుంటుందని ప్రచారం జరిగింది. పూరి జగన్నాథ్ సీరియస్గా ట్రై చేసినా వర్కవు్ కాలేదు.
కానీ త్రివిక్రమ్ తన ప్రాజెక్ట్ కోసం జాన్వీని ఒప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. `అల వైకుంఠపురములో` చిత్రంతో ఈ ఏడాది ప్రారంభంలో త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఊపులో యంగ్ టైగర్ ఎన్టీఆర్లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎస్. రాధాకష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది.
ఇదిలా వుంటే ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అందులో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ భామ కోసం ప్రయత్నాలు చేస్తున్న త్రివిక్రమ్ తాజాగా జాన్వీ కపూర్ని ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. ఇక రెండవ కథానాయికగా నభా నటేష్ కనిపించనుందట. ఓ పురాతన కోట నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.