అర్జున్ రెడ్డి చిత్రంలో అసమాన నటన ప్రదర్శించినందుకు గాను విజయ్ దేవరకొండ ని ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించిన విషయం తెలిసిందే , కాగా ఆ అవార్డు ని అందుకున్న సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డు ని వేలం వేస్తానని దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే . చెప్పిన మాట ప్రకారం నిన్న హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డు ని వేలం వేసాడు కాగా ఈ అవార్డు ఏకంగా 25 లక్షలు పలికింది దాంతో ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం కు అందిస్తానని తెలిపాడు విజయ్ దేవరకొండ .
ఇక ఈ అవార్డు ని 25 లక్షలకు సొంతం చేసుకున్నది ఎవరో తెలుసా …… ఫార్మా కంపెనీ కి చెందిన దివి ల్యాబ్స్ అధినేత భార్య శకుంతల దివి 25 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది . నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మెరిసిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో సంచలనం సృష్టించాడు ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు . అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ డం అందుకున్నాడు విజయ్ దేవరకొండ . నిన్న వేలం వేయగా శకుంతల దివి ఆ ఫిల్మ్ ఫేర్ ని సొంతం చేసుకోవడంతో పెద్ద మొత్తమే సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాడు విజయ్ దేవరకొండ . యువ నాయకులు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు విజయ్ దేవరకొండ దాంతో ఈ పని చేస్తున్నాడు .
English Title: hero Vijay Deverakonda Film Fare Award sold for Rs 25 Lakhs