Homeటాప్ స్టోరీస్నేష‌న‌ల్ మీడియాని చూస్తే జాలేస్తోంది!

నేష‌న‌ల్ మీడియాని చూస్తే జాలేస్తోంది!

నేష‌న‌ల్ మీడియాని చూస్తే జాలేస్తోంది!
నేష‌న‌ల్ మీడియాని చూస్తే జాలేస్తోంది!

నేష‌న‌ల్ మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్‌. ఓ ర‌కంగా జాతీయ మీడియాపై సెటైర్లు వేశారు. అలా హారీష్‌శంక‌ర్ జాతీయ మీడియాపై సెటైర్లు వేయ‌డంలో ఎలాంటి త‌ప్పు క‌నిపించ‌డం లేదు కూడా. వివార‌ల్లోకి వెళితే.. ఇటీవ‌ల జాతీయ మీడియా సుశాంత్ సింగ్ అనుమానాస్ప‌ద మృతి .. ఆ త‌రువాత బాలీవుడ్‌లో పెరిగిపోతున్న డ్ర‌గ్ సంస్కృతిని ఎండ‌గ‌డుతూ వ‌రుస క‌థ‌నాల్ని ప్ర‌సారం చేస్తోంది.

అంతేనా సుశాంత్ కేసుకీ బాలీవుడ్ డ్ర‌గ్ సంస్కృతి సంబంధం వుంద‌ని సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది. దీనిపై ప‌రిశోధ‌నాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌రుస బ్రేకింగ్‌ల‌ని ప్ర‌సారం చేస్తోంది. దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సుశాంత్ మృతి వెన‌క దాగివున్న అస‌లు ర‌హ‌స్యాన్ని వెలికితీసే ప‌నిలో బిజీ బిజీగా వుంటోంది. అంతా బాగానే వుంది. కానీ గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌ఠాన్మర‌ణంపై మాత్రం పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేక‌పోయింది.

- Advertisement -

ఏదో కొన్ని క‌థ‌నాల్ని ప్ర‌సారం చేశాం అంటే చేశాం అనిపించుకుంది. అయితే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ మీడియా బీబీసీ వ‌ర‌ల్డ్ మాత్రం బాలుకి స‌ముచిత గౌర‌వాన్ని ఇచ్చింది. ఓ లెజెండ్‌కు ఇవ్వాల్సిన గౌన‌వాన్ని అందించిన ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. దీంతో హార్ట్ అయిన హ‌రీష్ శంక‌ర్ జాతీయ మీడియాపై సెటైర్లు వేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత  అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..
మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..ఇరుకు సందుల్లో కాదు..` అంటూ ఘాటుగా స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All