గతకొంత కాలంగా నందమూరి వారి ఇంట అన్నాదమ్ముల మధ్య బాబాయ్ -అబ్బాయ్ ల మధ్య సఖ్యత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నందమూరి హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది . హరికృష్ణ మరణం ఒక్కసారిగా నందమూరి కుటుంబాన్ని షాక్ కి గురిచేసింది , దాంతో విషాదంలో అందరి మధ్య ఉన్న అరమరికలు తొలగిపోయి అన్నగారి కుటుంబం కలిసిపోయింది . బాలకృష్ణ బాబాయ్ ఆప్యాయంగా అబ్బాయ్ లు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లను పలకరిస్తుంటే చూసేవాళ్లకు చూడముచ్చటగా ఉంది ఆ కలయిక .
తాజాగా బాలయ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లతో టిఫిన్ చేస్తూ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంతకుముందు వరకు ఆ కుటుంబంలో ఉన్న మనస్పర్థలు ఈ దెబ్బతో పోయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య ,ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు మళ్ళీ కలవడంతో నందమూరి అభిమానులకు పండగే పండగ ! ఎన్టీఆర్ లో కూడా కొత్త జోష్ రావడానికి కారణం అవుతుంది బాలయ్య బాబాయ్ పలకరింపుల వల్ల .
English Title: good news for nandamuri fans : balakrishna with kalyan ram and Ntr
https://www.youtube.com/watch?time_continue=10&v=Nr28xtZ_YBI