Homeటాప్ స్టోరీస్శోకసంద్రంలో ఎన్టీఆర్

శోకసంద్రంలో ఎన్టీఆర్

jr Ntr in deep shockingయంగ్ టైగర్ ఎన్టీఆర్ శోకసంద్రంలో మునిగాడు , తండ్రి మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు . నందమూరి హరికృష్ణ ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే . రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు అన్న వార్త విని తీవ్ర దిగ్బ్రాంతి కి గురైన ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి నార్కట్ పల్లి లోని ఆసుపత్రికి తరలివచ్చాడు . అక్కడ తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక విలవిలాడాడు ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా . తమ ఎదుగుదలకి చూసి గర్వపడుతున్నాడన్న సంతోషం ఎంతో కాలం లేకుండానే తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఏమి మాట్లాడాలో తెలీని స్థితిలో పడ్డారు ఇద్దరు సోదరులు .

ఓ పెళ్లి వేడుకకు వెళ్తున్న నాన్న ఇలా విగతజీవి గా వస్తాడని ఊహించలేని సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు . ఎన్టీఆర్ కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే , ఉద్విఘ్న వాతావరణం నెలకొంది ఆసుపత్రి దగ్గర . ఇక ఎన్టీఆర్ తల్లి షాలిని తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరికి ఇది షాకింగ్ న్యూస్ . హరికృష్ణ ఇక లేడు అన్న వార్త విని నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు . విచిత్రం ఏంటంటే హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కూడా హరికృష్ణ మరణించిన స్థలానికి కొద్దిదూరంలోనే మరణించడం అత్యంత విషాదకరం .

- Advertisement -

English Title: jr Ntr in deep shocking

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All