మొన్న ఆగస్టు 24న విడుదలైన నాలుగు చిత్రాలు ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . ఆగస్టు 24న ” నీవెవరో ” , ” ఆటగాళ్లు ” , ” లక్ష్మీ ” ,
” అంతకుమించి ” చిత్రాలు విడుదల కాగా ఆ నాలుగు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి . అసలు ఈ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ లలో జనాలు లేక వెలవెలబోతున్నాయి . ఆది పినిశెట్టి , తాప్సి , రితికా సింగ్ నటించిన ” నీవెవరో ” చిత్రంపై కాస్త అంచనాలు ఉండేవి కానీ సినిమా విడుదలయ్యాక ఆ అంచనాలు అన్ని మాయం అయిపోయాయి దాంతో ఆ సినిమా ఊసులో లేకుండా పోయింది .
ఇక జగపతిబాబు – నారా రోహిత్ లు నటించిన ” ఆటగాళ్లు ” చిత్రం అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి . పరమచెత్త సినిమాగా తేల్చేసారు ప్రేక్షకులు . దాంతో రెండో రోజునే చాలా థియేటర్ ల నుండి ఈ సినిమాని తీసిపడేసారు . హాట్ భామ రష్మీ నటించిన అంతకుమించి కాస్త ఫరవాలేదు ఎందుకంటే రష్మీ అందాల కోసం కొంతమంది కుర్రాళ్ళు వెళ్తున్నారు తప్ప అందులో కూడా పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో అంతకుమించి కూడా డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది . ఇక లక్ష్మి విషయానికి వస్తే ఇలాంటి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి దాంతో పెద్దగా ఈ సినిమాని పట్టించుకోలేదు జనాలు . మొత్తంగా ఆగస్టు 24న విడుదలైన నాలుగు చిత్రాలు నిరాశపరిచాయి .
English Title: flop talk to four movies