Homeటాప్ స్టోరీస్జనాలు లేక వెలవెలబోతున్న ఆటగాళ్లు

జనాలు లేక వెలవెలబోతున్న ఆటగాళ్లు

no audience for aatagalluఈరోజు నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో ఏది కూడా ఆకట్టుకునేలా లేకపోవడంతో జనాలు ఆ థియేటర్ ల వైపు చూసే సాహసమే చేయడం లేదు కుదిరితే మళ్ళీ విజయ్ దేవరకొండ గీత గోవిందం ని చూస్తున్నారు తప్ప మిగతా సినిమాల థియేటర్ లలో పెద్దగా జనాలు లేరు . ఇక ఆటగాళ్లు ప్రదర్శిస్తున్న థియేటర్ లలో అయితే కనీసం ఈగలు కూడా లేకుండాపోయాయి . ప్రేక్షకులు లేక ఆటగాళ్లు థియేటర్ లు వెలవెలబోతున్నాయి . ముందుగానే ఆటగాళ్లు సినిమాకు పెద్దగా జనాలు రారని ఫిక్స్ అయ్యారు అందుకే తక్కువ సంఖ్యలోనే థియేటర్ లు ఇచ్చారు ఆ ఇచ్చిన థియేటర్ లలో కూడా జనాలు లేక వెలవెలబోతున్నాయి .

ఆటగాళ్లు చిత్రంలో నారా రోహిత్ , జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించాడు . నారా రోహిత్ చాలా సినిమాల్లో నటిస్తున్నాడు కానీ ఏవీ పెద్దగా ఆడిన దాఖలాలు అయితే లేవు , ఇక జగపతిబాబు విషయానికి వస్తే విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాడు కాబట్టి అతడికి కూడా పెద్దగా మార్కెట్ లేదు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పడిపోయింది దాంతో ఆటగాళ్లు చిత్రాన్ని పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు . ఇక సినిమా కూడా ఆకట్టుకునేలా లేకపోవడంతో హమ్మయ్య ! బ్రతుకు జీవుడా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు .

- Advertisement -

English Title: no audience for aatagallu

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All