ఎన్టీఆర్ హోస్ట్ గా మరి చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి ఆరంభం అదిరిపోయింది. రామ్ చరణ్ మొదటి గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ 11 టీఆర్పీ సాధించింది. జెమినీ టివిలో ఈ షో ప్రసారమవుతోంది కాబట్టి ఈ రేటింగ్స్ మంచివే అని భావించారంతా. సెకండ్ వీక్ నుండి ఎవరు మీలో కోటీశ్వరులు కొంత డ్రాప్ అయినా కూడా కన్సిస్టెంట్ గా 5 టీఆర్పీ మైంటైన్ చేస్తూ వచ్చింది. గత వారం జెమినీ టివి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని బాగా ప్రమోట్ చేయడంతో 6 కు కూడా వెళ్ళింది.
అయితే మళ్ళీ రేటింగ్స్ పడిపోయాయి. తాజా నివేదికలో ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి కేవలం 4 రేటింగ్స్ పాయింట్స్ రావడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్ మొదలవ్వడంతో ఆ ప్రభావం ఈ షో పై పడిందా అనిపిస్తోంది. మరోవైపు స్టార్ మా లో బిగ్ బాస్ ఉన్నా కానీ ఈ రెండిటి టైమింగ్స్ వేరు కావడంతో సమస్య లేదు.
ఇంకా ఫ్యామిలీ ఆడియెన్స్ సీరియల్స్ కే ఓటు వేస్తున్నారు. యూత్ ఏమో ఐపీఎల్ తో బిజీ కావడం ఈ రేటింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణాలు. మరి యాజమాన్యం మళ్ళీ రేటింగ్స్ పెంచడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరం.