కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని మొత్తం అంధకారంలోకి నెట్టేస్తోంది. ఏ స్టేట్ వార్తలు విన్నా కరోనా మరణాలే, కరోనా కేసులే అత్యధికంగా నమోదవుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. సెకండ్ వేవ్ రోజు రోజుకీ మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. స్మశానాల్లో శవాలని కాల్చడానికి భారీ క్యూ నెలకొంటోందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో సినీ వర్గాలు వరుసగా తమ సినిమాల రిలీజ్లని వాయిదా వేస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన `ఆచార్య` మూవీ రిలీజ్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జాబితాలో యంగ్ హీరో సంతోష్ శోభన్ మూవీ `ఏక్ మినీ కథ` చిత్రం చేరింది. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ఏక్ మినీ కథ`. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని యువీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 30న రిలీజ్ చేయడం లేదని, పరిస్థితులు చక్కబడిన తరువాత కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్, సుదర్శన్లపై చేసిన ఓ వీడియోని రిలీజ్ చేసింది.
Don’t step out, don’t let your loved ones too #EkMiniKathaPostponed ????
▶️: https://t.co/xEQcyjoFBl#EkMiniKatha not coming on April 30th,
Ek Mini Gap tho soon in Cinemas✨@santoshshobhan @KavyaThapar @MerlapakaG @karthikrapol @MangoMusicLabel @UVConcepts_ pic.twitter.com/WDaQJF1brH— BARaju (@baraju_SuperHit) April 26, 2021