దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ భీతావాహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా మరణాలే వినిపిస్తున్నాయి. దేశం ఎమర్జెన్సీలోకి వెళ్లిపోయిందా? అనేంతగా పరీస్థితులు మారిపోఉన్నాయి. అత్యంత విషమ పరిస్థితుల్లోకి దేశం జారుకుంటున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు సినిమాలు తమ రిలీజ్లని వయిదా వేస్తున్నాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం `ఆచార్య` రిలీజ్ కూడా వాయిదా పడింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై శ్రీమతి కొణిదెల సురేఖ సమర్పణలో నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. రామ్చరణ్ కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్కు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు.
ఈ మూవీని మే 13న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ ముందు ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ని కూడా ఇటీవల ప్రకటించారు. అయితే దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు వచ్చిన తరువాత మరో రిలీజ్ డేట్ని ప్రకటిస్తామరి నిర్మాతలు నిరంజన్రెడ్డి, రామ్చరణ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.