Homeగాసిప్స్చిరు `ఆచార్య` నుంచి మ‌రొక‌రు త‌ప్పుకున్నారా?

చిరు `ఆచార్య` నుంచి మ‌రొక‌రు త‌ప్పుకున్నారా?

చిరు `ఆచార్య` నుంచి మ‌రొక‌రు త‌ప్పుకున్నారా?
చిరు `ఆచార్య` నుంచి మ‌రొక‌రు త‌ప్పుకున్నారా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా స‌గం పూర్త‌యింది. చిరుకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రించారు. త్రిష స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ , మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. సినిమాలోని న‌క్స‌లైట్ ఉద్య‌మ నాయ‌కుడిగా, స్టూడెంట్ లీడ‌ర్‌గా ఓ కీల‌క పాత్ర‌ని హీరో రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి షూటింగ్ మేలో ప్రారంభం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

- Advertisement -

ఇదిలా వుంటే ఇటీవ‌ల ఈ చిత్రం నుంచి త్రిష త‌ప్పుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ త‌రువాత ఈ సినిమా నుంచి మ‌రో కీల‌క వ్య‌క్తి తాజాగా త‌ప్పుకున్న‌ట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో ఎడిట‌ర్‌గా గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. అయితే ప్రాజెక్ట్ డిలే అవుతుండ‌టంతో ఆయ‌న ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ స్థానంలో యంగ్ ఎడిట‌ర్ న‌వీన్ నూలిని తీసుకున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All