సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమా మరొకరి చేతుల్లోకి వెళ్లడం.. ఒక హీరోతో మొదలైన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం.. ఒక హీరోయిన్ని ఫిక్స్ చేసుకున్న సినిమా మరో హీరోయిన్కు వెళ్లడం అన్నది ఇక్కడ శరా మామూలే. ఎండ్ ఆఫ్ ద డే ఒకరి హిట్ మరొకరి ఖాతాలోకి చేరడం మమూలే. అయితే తొలిసారి ఓ హీరోయిన్ హర్ట్ అయి ఆ సినిమా నుంచి తప్పుకోవడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. ఒక స్టార్ హీరో సినిమా నుంచి స్టార్ హీరోయిన్ తానే స్వయంగా తప్పకుంటున్నానంటూ ప్రకటించడం ఈ మధ్య కాలంలో తొలిసారి.
చిరంజీవి – కొరటాల కలయికలో `ఆచార్య` పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి ఎండో మెంట్ అధికారిగా, నక్సల్ ఉద్యమనేతగా కనిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా త్రిషని చిత్ర బృందం ఎంపిక చేసింది. షూటింగ్ ఆమెపై ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పటి వరకు చిరుపై పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి తప్పకుంటున్నట్టు త్రిష ప్రకటించడం పలువురిని షాక్కు గురిచేస్తోంది.
త్రిష వున్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకెవడానికి కారణం ఏంటీ? అని ఆరాతీస్తే ఆమె పారితోషికం అని తెలిసింది. త్రిష సినిమా అంగీకరించిన సందర్భంలో చిత్ర బృందం ఆమె కోరిన పారితోషికాన్ని ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారట. తీరా సినిమాలో మరో కథానాయిక, మరో కథానాయకుడు వున్నారని చెప్పడంతో త్రిష పారితోషికాన్ని సగానికి తగ్గించారట. అది నచ్చని త్రిష చిరు సినిమాకు గుడ్బై చెప్పినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.