ఎం.ఎస్. రాజు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ వుంది. ఆయన సమ్మర్కి సినిమా వదిలారంటే థియేటర్లన్నీ కిటకిటలాడాల్సిందే. సుమంత్ ఆర్ట్స్పై ఆయన నిర్మించిన ఒక్కడు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచి భారీ వసూళ్లని సాధించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఆయన నుంచి వచ్చిన చిత్రం `డర్టీహరి` తొలి రోజు వసూళ్ల పరంగా రికార్డుని సృష్టించింది. మంచి టాక్ రావడంతో అనూహ్యంగా వ్యూస్ని రాబడుతోంది.
శ్రవన్రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ ఎం.ఎస్. రాజు నిర్మించిన చిత్రం `డర్టీహరి`. రుహానీ శర్మ, సిమ్రత్కౌర్ హీరోయిన్ లుగా నటించారు. యువతని మెయిన్ టార్గెట్ చేస్తూ బోల్డ్ కంటెంట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్రైడే మూవీస్ ఏటీటీలో ఈ నెల 18న సాయంత్రం 6గంటలకు విడుదలైంది. గత తొమ్మిది నెలలుగా థియేటర్లు మూతపడటంతో మేకర్స్ చాలా వరకు ఓటీటీలతో పాటు ఏటీటీలని నమ్ముకుంటున్నారు. అదే క్రమంలో `డర్టీహరి`ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ యాప్లో రిలీజ్ చేశారు. తొలి రోజు అంటే 24 గంటల్లో ఈ మూవీ 91818 వ్యూస్ని దక్కించుకుంది. 18 న సాంకేతికంగా సమస్యలు తలెత్తినా ఆ తరువాత టెక్నికల్ టీమ్ సమస్యని పరిష్కరించడంతో 19 రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ మూవీ 91818 వ్యూస్ని దక్కించుకోవడం విశేషం.
అంటే కోటీ 20 లక్షలు అన్నమాట. తొలి రోజే ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నారట. తక్కువ బడ్జెట్లో పూర్తి చేసిన ఈ మూవీ తొలి రోజు వసూళ్ల పరంగా కోటి దాటి వసూలు చేసిందంటే రానున్న రోజుల్లో నిర్మాతలకు లాభాల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజు వీవర్స్ అధిక సంఖ్యలో సినిమా చేడటానికి ముందుకు రావడంతో కొంత ఇబ్బంది తలెత్తినా ప్రస్తుతం ఫ్రైడే మూవీస్ యాప్లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకపోవడంతో వీక్షలు హ్యాపీగా `డర్టీహరి`ని ఎంజాయ్ చేస్తున్నారట.