దక్షిణాదిలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సందడి ఇప్పటిడిప్పుడే ఊపందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తరువాత దక్షిణాదిలో వీవర్స్ ని `ఆహా` ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక లాక్డౌన్ పుణ్యమా అని ఓటీటీల జోరు మరింత పెరిగిపోయింది. దీనికి తోడు థియేటర్ల కూడా తెరవక పోవడం.. జనాలు అంతా ఇంటికే పరిమితం కావడంతో వినోదం కోసం టీవీ తరువాత ఓటీటీలకే ప్రధమ ప్రధాన్యం ఇవ్వడం మొదలైంది.
ఓటీటలతో పాటు కరోనా కారణంగా ఓటీటీలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ క్రమంలో మరో కొత్త డిజిటల్ ఫ్లాట్ ఫామ్ `ఫ్రైడే మూవీస్` వీక్షకులకు ఇంటి వద్దే వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు `ఫ్రైడే సినిమా` యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులోనే మినిమమ్ అమౌంట్ పే చేసి నేరుగా సినిమా చూసేయెచ్చు. ఈ యాప్లో ముందుగా బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత యం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన `డర్టీ హరి` విడుదల కాబోతోంది.
ఈ నెల 18న ఈ మూవీ `ఫ్రైడే మూవీస్`లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ తనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని చాలా కాన్ఫిడెంట్తో వున్నారు యం.ఎస్. రాజు. విభిన్నమైన ఆలోచనలతో హై ఫై లైఫ్కి అలవాటు పడిన ఓ యువకుడి కథగా `డర్టీ హరి`ని రూపొందించానని, అన్ని రాకల చిత్రాలని నిర్మించిన తనకు ఈ జోనర్ని ఎందుకు టచ్ చేయకూడదన్న ఆలోచనతో చేసిన చిత్రమిదని యం.ఎస్. రాజు చెబుతున్నారు. కొంత విరామం తరువాత చేస్తున్న ఈ మూవీ తనకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డర్టీ మైండ్ వున్న ఓ యువకుడి కథే కానీ ఇందులో డర్టీ సీన్లు అంటూ ఏమీ లేవని, క్లైమాక్స్ చూసిన తరువాత తను చేసింది మంచి ప్రయత్నమని అంతా అంటారని యం.ఎస్. రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు చేస్తానని, మళ్లీ తన మార్కు సినిమాలకు శ్రీకారం చుడతానని ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు తెలిపారు.
`ఫ్రైడే మూవీస్` అధినేతలు కూడా `డర్టీ హరి`తో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంని భావిస్తున్నారట. కాన్ఫిడెంట్తో వున్నట్టు తెలుస్తోంది. యం.ఎస్. రాజు హిట్ ఇచ్చిన తరువాతే ప్రభాస్, మహేష్, దేవి శ్రీప్రసాద్, సిద్ధార్థ్ ల కెరీర్ మలుపు తిరిగింది. అదే సెంటిమెంట్ తమ `ఫ్రైడే మూవీస్` విషయంలోనూ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. అది ఎంత వరకు నిజం కానుందన్నది తెలియాలంటే `డర్టీ హరి` రిలీజ్ ఆకనున్న డిసెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.