Homeటాప్ స్టోరీస్లక్ష ఇచ్చి వివాదానికి చెక్ పెట్టిన సుకుమార్

లక్ష ఇచ్చి వివాదానికి చెక్ పెట్టిన సుకుమార్

director sukumar sends one lakh to singer ganta venkatalakshmiఈ ఏడాది సంచలన విజయం సాధించిన చిత్రం రంగస్థలం , కాగా ఆ చిత్రంలో ”జిల్ జిల్ జిగేలు రాణి ” పాట పాడిన గంటా వెంకటలక్ష్మి కి పైసా రెమ్యునరేషన్ ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన ని వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పందించిన దర్శకులు సుకుమార్ ఆ సింగర్ కు లక్ష రూపాయలు పంపించి ఆ వివాదానికి ముగింపు పలికాడు . సంఘటన వివరాలలోకి వెళితే ……. రంగస్థలం చిత్రంలో ” జిల్ జిల్ జిగేలు రాణి ”అనే పాట పాడింది గంటా వెంకటలక్ష్మి అనే గాయని . వెంకటలక్ష్మి గొంతు చాలా అరుదుగా ఉండటంతో ఈ ఐటెం సాంగ్ కి ఆమె కరెక్ట్ అని భావించి పాడించారు .

అయితే పాట పాడటానికి ఇక్కడి నుండి చెన్నై వెళ్లి పాడి వచ్చింది కానీ ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వలేదట ! మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో అతగాడు ఆ మొత్తం డబ్బు ని తీసుకున్నాడు దాంతో మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన ని వ్యక్తం చేసింది . ఈ విషయం దర్శకులు సుకుమార్ కు తెలియడంతో వెంటనే స్పందించి లక్ష రూపాయలు ఆమెకు పంపించాడట ! టాలెంట్ ని తొక్కెయ్యడానికి లేదని సుకుమార్ ఇలా చేసాడట . సుకుమార్ డబ్బులు పంపించడంతో ఆ గాయని చాలా సంతోషంగా ఉంది . మొత్తానికి ఆలస్యమైనా డబ్బులు పంపి వివాదానికి ముగింపు పలికాడు సుకుమార్ .

- Advertisement -

English Title: director sukumar sends one lakh to singer ganta venkatalakshmi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All