శ్రీనివాస కళ్యాణం చిత్రానికి నేను డెబ్యూ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నానని ఓ వెబ్ సైట్ లో రాసారని అది చూసి చాలా బాధపడ్డానని ఎందుకంటే ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడని అన్నాడు నిర్మాత దిల్ రాజు . నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం . ప్రకాష్ రాజ్ – జయసుధ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల అవుతోంది దాంతో మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు ఈ సినిమాకు దర్శకుడు సతీష్ వేగేశ్న అని అయితే కథ కథనంలో నా ప్రమేయం ఉంటుందని నాతొ పాటుగా నా టీమ్ ఉంటుందని కానీ ఇలా ప్రచారం కావడం బాధేసిందని అంటున్నాడు .
ఇక సినిమా విషయానికి వస్తే ……. సినిమా చాలా బాగా వచ్చిందని అందుకే నా తదుపరి చిత్రం కూడా సతీష్ తోనే చేస్తున్నానని ప్రకటించాడు దిల్ రాజు . నితిన్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు దాంతో అతడి పరాజయాలకు శ్రీనివాస కళ్యాణం చెక్ పెడుతుందని భావిస్తున్నారు . ఫ్యామిలి చిత్రాలు కోరుకునే వాళ్లకు , యువతకు ఈ సినిమా నచ్చడం ఖాయమని ధీమాగా ఉన్నారు . ఇక ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఈనెల 9న తేలిపోనుంది .
English Title: dil raju unhappy with rumours