టాలీవుడ్ క్రేజీ గాయనీ సునీత పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన సునీత ఇప్పటికీ యంగ్గానే కనిపిస్తుంటారు. ఆమె అందానికి ముగ్ధుడైన రాఘవేంద్రరావు హీరోయిన్గా పరిచయం చేస్తానని అన్నారంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సునీత భర్త కిరణ్తో విడిపోయి గత కొంత కాలంగా పిల్లలతో కలిసి ఒంటరిగా వుంటున్నారు.
ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతోందని వరుస కథనాలు వినిపిస్తూనే వున్నాయి. ఆ వార్తలని సునీత ఖండీస్తూ వస్తున్నారు. తాజాగా మ్యాంగో రామ్ ని వివాహం చేసుకోబోతున్నానంటూ ప్రకటించి షాకిచ్చారు. పెళ్లి ఆలోచన లేదన్న సునీత పెళ్లికి రెడీ అవడం వెనక ఏం జరిగింది? ఆమె మనసు మార్చింది ఎవరు అన్నది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సునీత మనసు మార్చింది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అని తెలిసింది. ఇటీవలే దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకుని టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్కి శుభారంభం పలికారు. ఆయనే సింగర్ సునీతని ఒప్పించి `మ్యాంగో` రామ్తో పెళ్లికి ఓకే చెప్పించారని తెలిసింది. మ్యాంగో రామ్, సింగర్ సునీత వివాహం ఈ నెల 27న జరగబోతోంది. వివాహానికి ముందే ఈ జంట కొత్త ఇంటిలోకి వెళ్లినట్టు తెలిసింది.